VijayaKumar

Apr 20 2024, 16:44

అక్రమంగా తరలిస్తున్న హాస్టల్ కిరాణా వస్తువులను పట్టుకున్న చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ నాయకులు

 భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో పుడ్ పాయిజన్ జరిగి ఓ విద్యార్థి మరణించిన సంఘటన పై పూర్తి విచారణ జరగక ముందే సిబ్బంది హాస్టల్ నుండి మిగిలి ఉన్న కిరాణా వస్తువులను ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ సభ్యులు ఆటోను అడ్డగించి నిలిపివేసిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. హాస్టల్ లో కలుషిత ఆహారం తీసుకొని కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురై, ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి సి.ఎచ్ ప్రశాంత్ మృతి చెందిన విషయం తెలిసిందే. కానీ పుడ్ పాయిజన్ కు కారణమైన కిరాణా వస్తువులను ఆటో నెంబర్ TS 27/ T 2170 ఆటో లో శనివారం మధ్యాహ్నం అక్రమంగా తరలిస్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా బాలల హక్కుల సంఘం నాయకులు కొడారి వెంకటేష్, భువనగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు బుగ్గ రమేష్ లు ఆటోను అడ్డగించి, ఆటోలోని కిరాణా వస్తువులను తిరిగి హాస్టల్ లోకి పంపించారు. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు కొడారి వెంకటేష్ మాట్లడుతూ గురుకుల పాఠశాలల కో- ఆర్డినేటర్ రజని మేడం, రెవెన్యూ డివిజన్ అధికారి అమరేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి జైపాల్ రెడ్డి లు హాస్టల్ తనిఖీ చేస్తున్న సమయంలోనే హాస్టల్ సిబ్బంది అక్రమంగా కిరాణా వస్తువులను ఆటోలో తరలించే ప్రయత్నం చేసారని ఆయన ఆరోపించారు. ఆటోను ఆపి డ్రైవర్ ను అడుగుతున్న సమయంలో హాస్టల్ సిబ్బంది ధనుంజయ్ వచ్చి ఆర్డీవో అనుమతి తో పంపిస్తున్నామని చెప్పగా ఆర్డీవో కు ఫోన్ చేయగా నాకు సంబంధం లేదని చెప్పాడని వెంకటేష్ తెలిపారు. ఆటోను స్వాధీనం చేసుకుని పంచనామా చేయాలని పట్టణ ఎస్సై అరుణ్ కుమార్ కు పోన్ లో పిర్యాదు చేయగా, మాకు సంబంధం లేదని, కిరాణా వస్తువుల శాంపిల్స్ పుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా గతంలోనే సేకరించినట్లు ఎస్సై అన్నట్లు వెంకటేష్ తెలిపారు. గురుకుల పాఠశాల రీజనల్ కో- ఆర్డినేటర్ రజని మేడంకు పోన్ చేయగా ఆమె స్పందించక స్పందించక పోవడంతో అట్టి కిరాణా వస్తువులను తిరిగి హాస్టల్ లోకి పంపించామని ఆయన అన్నారు. గురుకుల పాఠశాలలకు సరఫరా చేసే కిరాణా వస్తువులలో నాణ్యత లోపించినట్లు స్పష్టంగా అర్థం అవుతుందని ఆయన అన్నారు. కిరాణా వస్తువులను సరఫరా చేసే కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హాస్టల్ లో జరిగిన సంఘటన పై పూర్తి స్థాయిలో విచారణ ముగిసేవరకు ఎలాంటి కిరాణా వస్తువులను హాస్టల్ నుండి తరలించరాదని ఆయన డిమాండ్ చేశారు. ఆహార భద్రతా అధికారులు శాంపిల్స్ సేకరించి, ల్యాబ్ కు పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రశాంత్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆయన కోరారు.

VijayaKumar

Apr 20 2024, 16:19

సిపిఎం ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన గెలవాలని కోరుతూ విరాళం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో సిపిఎం ఎంపీ అభ్యర్థి ఎండి జహంగీర్ ఇంటింటి ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది .

ఈ సందర్భంగా ఓటు అభ్యర్థించడానికి ఓ కార్యకర్త ఇంటికి వెళ్లిన సిపిఎం ఎంపీ అభ్యర్థికి సిపిఎం సీనియర్ నాయకుడుగా ఉన్న వరికుప్పల యాదయ్య మీరు గెలవాలని కోరుతూ 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని విరాళంగా ఇచ్చారు ఇంటింటికి తిరిగిన సిపిఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ కు ప్రజలు హారతులు ఇచ్చి పూలదండలు తో స్వాగతం తెలియజేశారు ప్రజల కోసం పోరాడే మీలాంటివారు ఈ ఎన్నికల్లో గెలవడం ప్రజలకు ఎంతో అవసరమని 

ఈసారి మా ఓటు మీకే అంటూ అనేకమంది వారికి హామీని ఇచ్చారు ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో సిపిఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ మాట్లాడుతూ పులిగిల్ల గ్రామంతో గత 35 సంవత్సరాలుగా అనుబంధం ఉందని మొట్టమొదటి ప్రచారం సాయుధ పోరాట చరిత్ర కలిగిన పులిగిల్ల నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఈ ఎన్నికల్లో అభ్యర్థులుగా ముందుకు వస్తున్న కాంగ్రెస్,బిఆర్ఎస్, బిజెపి అభ్యర్థుల యొక్క చరిత్ర ఏమిటో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలని,ప్రజల కోసం ఎలాంటి వ్యాపారాలు,వ్యాపకాలు లేకుండా పోరాడుతున్న నాలాంటి వ్యక్తికి ఒక్క అవకాశం కల్పించాలని కోరారు ఈ గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో కొమ్మిడి లక్ష్మారెడ్డి నాయకత్వం లో గత 35 సంవత్సరాలుగా ప్రజల కోసం అనేక పోరాటాలు నడిపి గ్రామ అభివృద్ధిని చేసి చూపించారన్నారు అమరజీవి వేముల మహేందర్ ప్రజల కోసం జీవితాంతం పోరాడి అమరుడైన ఈ గ్రామం కమ్యూనిస్టులకు ఎప్పుడు అండగా నిలిచిందన్నారు కమ్యూనిస్టులకు ఓటు వేస్తే ప్రజల కోసం పనిచేసే సేవకున్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు ప్రస్తుతం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మిగతా మూడు పార్టీల అభ్యర్థులు ఏనాడు ప్రజల కోసం పోరాడిన చరిత్ర లేదని వాళ్లకున్న వ్యాపారాలను మరింత పెంచుకోవడం తప్ప ప్రజలకు ఎలాంటి మేలు జరగదని అందుకే నిజాయితీగా 35 సంవత్సరాలుగా ప్రజా పోరాటాలు చేస్తున్న తనకు అవకాశం కల్పించాలని కోరారు ఈ ప్రాంతానికి సాగునీరు అందించే బునాది గాని కాలువ ప్రారంభించి 20 సంవత్సరాలు గడుస్తున్న గత ఎంపిలుగా గెలిచిన ముగ్గురు బీఆర్ఎస్, కాంగ్రెస్,పాలకుల యొక్క నిర్లక్ష్యం మూలంగా నేటికీ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు సిపిఎం కు అవకాశం ఇచ్చి ఈ ఎన్నికల్లో ఎంపీగా గెలిపిస్తే బునాది గాని కాలువను పూర్తి చేయడమే కాకుండా ఆ కాలువ ద్వారా గోదావరి జలాలను ఈ ప్రాంత రైతాంగానికి అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ నారి ఐలయ్య జగదీష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరు బాలరాజు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆవనగంటి వెంకటేశం, సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, జిల్లా కమిటి సభ్యులు గడ్డం వెంకటేష్,సీనియర్ నాయకులు కళ్లెం సుదర్శన్ రెడ్డి,మండల కమిటీ సభ్యులు వాకిటి వెంకటరెడ్డి,కందడి సత్తిరెడ్డి, శాఖ కార్యదర్శి బుగ్గ చంద్రమౌళి,స్థానిక పార్టీ నాయకులు దొడ్డి బిక్షపతి,వరికుప్పల యాదయ్య, వడ్డేమాన్ వెంకటయ్య, బుగ్గ ఐలయ్య, వేముల చంద్రయ్య,వరికుప్పల శంకరయ్య,వేముల ఆనంద్, దొడ్డి యాదగిరి, వేముల అమరేందర్, బొడ్డు రాములు,వేముల ముత్తయ్య,వడ్డెమని మధు,వనం యాదయ్య,మారబోయిన ముత్యాలు,ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వేముల నాగరాజు,వరికుప్పల సతీష్,కొమ్మిడి క్రిష్ణా రెడ్డి, వరికుప్పల శ్రీశైలం,వేముల రాంబాబు,సందేల శ్రీకాంత్, వేముల జ్యోతిబస్,దయ్యాల నర్సింహ,వరికుప్పల యాదమ్మ,వేముల రమణమ్మ,మౌనిక,వడ్డెమని ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 20 2024, 15:34

అస్వస్థతకు గురైన మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నరసింహులు


యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి జిల్లాకు చెందిన

 మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు శ్రీ మోత్కుపల్లి నర్సింహులు శనివారం అస్వస్థతకు గురయ్యారు.

అకస్మాత్తుగా బిపి డౌన్ కావడం, షుగర్ లెవల్స్ పడిపోవడంతో బేగంపేటలోని వెల్నెస్ ఆసుపత్రిలో చేరడం జరిగినది.

పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు అత్యవసర చికిత్సను అదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

VijayaKumar

Apr 20 2024, 15:25

కేంద్రంలో మరోమారు బిజెపి సర్కార్

*భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బోళ్ల సుదర్శన్ ఆధ్వర్యంలో ఈరోజు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ఇంటింటి ప్రచారంను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి.యన్.రెడ్డి ,స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలె చంద్రశేఖర్ ,పార్లమెంట్ కన్వీనర్ బంధారపు లింగస్వామి గౌడ్ హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే కావున భువనగిరి పార్లమెంట్లో బూర నర్సయ్య గౌడ్ కచ్చితంగా గెలవడం వల్ల భువనగిరి పార్లమెంట్ అభివృద్ధి జరుగుతుందని అన్నారు, బిజెపి గెలవడం వల్ల కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకం క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్తుందని అన్నారు, ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అని ఈ సందర్భంగా వారు అన్నారు ,తెలంగాణ లో టిఆర్ఎస్ పని ఐపోయింది, కాంగ్రెస్ అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేసిందని అన్నారు ఈ రెండు పార్టీలు అమలుకాని హామీలతో , తెలంగాణ ప్రజలను ఆకర్షించడానికి ఉచిత పథకాలకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఉచితంగా ఇవ్వాల్సిన విద్య వైద్యం మౌలిక సదుపాయాలను ప్రజల నుండి దూరం చేస్తున్నారని అన్నారు .టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేయడం వృధా అని అన్నారు ,ప్రజలు బీజేపీ కి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు అని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, సీనియర్ నాయకులు సత్తయ్య కణతాల అశోక్ రెడ్డి జిల్లా కార్య వర్గ సభ్యులు భచ్చు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి మారోజు అనిల్ కుమార్ ,లోడే లింగస్వామి , మండల కమిటీ సభ్యులు సంతోష్ దయ్యాల వెంకటేశం, అప్పిశెట్టి సంతోష్,మైసొల్ల మచ్చ గిరి, మందుల నాగరాజు, మోర్చా అధ్యక్షులు కొత్త రామచంద్రం వెలిమినేటి వెంకటేశం బీజేవైఎం నాయకులు బుంగమట్ల మహేష్ ,రేగురి అమరేందర్, దంతూరి అరుణ్,ఏళ్ళంకి మురళి, ఎర్రబోలు జంగయ్య, పాతకోట నరేష్,మైసొల్ల హరీష్,పుండరీకం కట్ట బిక్షం శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 20 2024, 14:30

భువనగిరి జిల్లాలో వరుస దోపిడీ, చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు


యాదాద్రి భువనగిరి జిల్లాలో వరుస దోపిడీ ,చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాచకొండ సిపి తరుణ్ జోషి మీడియా ముందు ప్రవేశపెట్టారు . నిందితుల నుండి 41 తులాల బంగారం ,రెండు కిలోల వెండి, ఒక ద్విచక్ర వాహనం , దూపిడికి ఉపయోగించిన పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిపి తరుణ్ జోషి తెలిపారు. నిందితులు పొట్టేటి మర్యాద పలునాడు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ 

కర్నే లక్ష్మి దత్తప్పగూడెం యాదాద్రి భువనగిరి జిల్లా

 పొట్టేటి శాంతయ్య పల్నాడు జిల్లా ఆంధ్ర ప్రదేశ్

.

 బాణాల రాజేష్ అమ్మనబోలు యాదాద్రి భువనగిరి జిల్లా వారీగా గుర్తించారు.

VijayaKumar

Apr 20 2024, 13:37

వలిగొండ మండల కేంద్రంలో అర్ధరాత్రి చోరీ... వివరాలు సేకరిస్తున్న పోలీసులు

 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో భీమిడి మధుసూదన్ రెడ్డి ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది . ఇంటిలో నుండి మూడున్నర తులాల బంగారం, 30 తులాల వెండి, 30 వేలు నగదు ను దొంగలు ఎత్తుకెళ్లారు .సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్న స్థానిక పోలీసులు, చౌటుప్పల్ ఏసిపి మధుసూదన్ రెడ్డి. మరో ఇంట్లో ఆరుబయట నిద్రిస్తున్న వ్యక్తి తల దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

VijayaKumar

Apr 20 2024, 07:52

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గూడూరు శివశాంత్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గొల్నేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గూడూరు శివశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు మాజీ సర్పంచులు, మదర్ డైరీ డైరెక్టర్ గూడూరు శ్రీధర్ రెడ్డితో సుమారు 200 మంది కార్యకర్తలు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో వలిగొండ లోని వారి స్వగృహంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు .వీరికి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ ఈనెల 21న నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, బోల్ల శ్రీనివాస్ ,గరిసె రవి , పల్సం సతీష్, గంగాపురం దైవా ధీనం, బాబు ,యాదయ్య, వెంకట్ రెడ్డి, మల్లేశం, యూత్ అధ్యక్షులు గంగాపురం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 19 2024, 21:57

గోపరాజు పల్లి కి చెందిన కీసర్ల వంశీధర్ రెడ్డి - శివాని ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం సోదరుడు కొండల్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజు పల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కీర్తిశేషులు కీసర్ల వెంకట నరసింహారెడ్డి- శ్రీమతి అనిత  కనిష్ట కుమారుడు కీసర్ల వంశిధర్ రెడ్డి- శివాని వివాహానికి  సీఎం రేవంత్ రెడ్డి గారి సోదరుడు కొండల్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ,భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై భువనగిరి సాయి కన్వెన్షన్ సెంటర్ లో నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గోపరాజుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కీసర్ల ఉపేంద్ర - సత్తిరెడ్డి, కీసర్ల రోజా- భరత్ రెడ్డి, పాశం ప్రేమలత- వెంకటరెడ్డి, జిల్లాకు చెందిన పలువురు ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులు, గోపరాజుపల్లి గ్రామం చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, బంధువులు స్నేహితులు ,తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 19 2024, 20:15

మానవత్వం చాటుకున్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య


యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మానవత్వం చాటుకున్నారు .భువనగిరి లో పెళ్లి వేడుకలకు హాజరై వెళుతుండగా భువనగిరి సమీపాన వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అక్కడ ఆగి క్షతగాత్రులను తన సొంత వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .

క్షతగాత్రులది జనగామ జిల్లాగా తెలిపారు .ప్రమాదంలో మహిళలకు గాయాలయ్యాయి.

VijayaKumar

Apr 19 2024, 19:26

విద్యార్థుల మృతిపై న్యాయం జరిపించాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ కి వినతి పత్రం అందజేసిన పల్ల గొర్ల మోదీ రాందేవ్


 భువనగిరి ప్రభుత్వ ఎస్సీ గురుకులా హాస్టల్లో మృతిచెందిన ఘటనలపై విచారణ జరిపించాలని SC ముఖ్య కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్ ను సెక్రటేరియట్లో కలిసి వినతిపత్రం ఇచ్చిన SC,ST,BC హాస్టల్స్ రాష్ట్ర కన్వీనర్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ వారు మాట్లాడుతూ భువనగిరి ఎస్సీ హాస్టల్లో కలుషిత ఆహారం తిని మృతి చెందిన ప్రశాంత్ అలాగే రెండు నెలల క్రితం ఎస్సీ హాస్టల్లో చనిపోయిన భవ్య, వైష్ణవి, 1 ఇయర్ క్రితం చనిపోయిన మనోహర్ ఇలా యాదాద్రి జిల్లాలో మూడు సంవత్సరాల వ్యవధిలో 9 మంది విద్యార్థుల మరణాలపై విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు జిల్లా sc సంక్షేమ శాఖ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు విద్యార్థుల ప్రాణాలంటే ఈ అధికారులకు దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఉంది జరిగిన ఘటనలకు బాధ్యులైన అందరిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తీసేయాలని విద్యార్థుల మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు మృతి చెందిన విద్యార్థి కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబానికి ఒక ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని జిల్లా మరియూ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో tssA అధ్యక్షులు కూరెళ్ళ మహేష్, MRPS నాయకులు చిట్టిపాక ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.